Text Size

20200917 ఆయన పవిత్ర భక్తి చారు స్వామి మహారాజా వ్యాస-పూజా వేడుకలో జూమ్ పాల్గొనడం

17 Sep 2020|Duration: 00:15:06||Homenaje a los Vaiṣṇavas|Transcription|Śrī Māyāpur, India

ఈ క్రిందిది భారతదేశంలోని శ్రీ ధామ మాయాపూర్‌లో 2020 సెప్టెంబర్ 17వ తేదీన జరిగిన BCSM వ్యాస-పూజ వేడుకలో పరమ పూజ్య జయపతాకా స్వామి మహారాజు గారు జూమ్ ద్వారా పాల్గొన్నది.

మూకం కరోతి వాచలం పంగుం లంగయతే గిరిం
యత్-కృపా తమ్ అహం వందే శ్రీ-గురుం దీన-తారణం
పరమానందం మాధవ్ చతరణం

హరిః ఓం తత్ సత్!

జయపతాకా స్వామి : ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. పరమ పూజ్య భక్తి చారు స్వామి వారు స్వభావరీత్యా ఒక సాధువు అని నాకు అనిపిస్తోంది. మనం ఒక సాధువు యొక్క కొన్ని గుణాలను అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తాము . కానీ అది వారి స్వభావం. వారు చాలా వినయంగా ఉంటూ అందరినీ సమానంగా చూసేవారు. ఈ విషయం వారి గురు సహోదర సహోదరీల హృదయాలను కదిలించింది. వారి సాంగత్యం పొందడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అలాంటి వారి సాంగత్యం లభించడం చాలా అరుదు. మనం చైతన్య-చరితామృతాన్ని వింటున్నాము—

'sādhu-saṅga', 'sādhu-saṅga'—sarva-śāstre kaya
lava-mātra sādhu-saṅge sādhu-saṅge sārva-siddhi haya
( Cc. మధ్య 22.54)

మాకు శ్రీ-శ్రీమద్ భక్తి చారు స్వామి మహారాజుతో చాలా సాంగత్యం ఉండేది. మేమెంత అదృష్టవంతులం! ఉపదేశ గ్రంథం ప్రకారం , మన ఆలోచనలు, భావాలన్నింటినీ పంచుకోగలిగే వ్యక్తి సాంగత్యం మనకు అవసరం. ఆ వ్యక్తి మన భావాలను విని, వాటిని నిజాయితీగా చెబుతారు. వారు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. ఈ విధంగా, మాకు ఆయనతో సాంగత్యం ఉండేది. నేను ఆయనకు అన్నీ చెప్పగలిగేవాడిని. శ్రీల ప్రభుపాదులను చూడగానే, అతనికి ఆయనపై అపారమైన, స్వచ్ఛమైన భక్తి కలిగింది. శ్రీల ప్రభుపాదులు కూడా అతని పట్ల చాలా కరుణ చూపేవారు. శ్రీల ప్రభుపాదులను కలవక ముందు, అతను ఒక ప్రత్యేక భక్తుడని మేము భావించేవాళ్ళం. సంకీర్తనకు వెళ్ళేటప్పుడు నేనే స్వయంగా అతన్ని తీసుకువెళ్ళేవాడిని . ఒకసారి ఏదో కారణం చేత అతన్ని తీసుకువెళ్ళలేదు. నేను మాయాపురానికి తిరిగి వచ్చినప్పుడు, అతను అక్కడ లేడు! నాకు చాలా భయం వేసింది. చైతన్యభాగవతంలో మనం చదివేదేమిటంటే, చైతన్యదేవుడు రాఢాదేశం గుండా వెళుతున్నప్పుడు అక్కడ హరినామం వినపడకపోవడంతో చాలా దుఃఖించారు. అప్పుడు నిత్యానంద ప్రభువు కొందరు చిన్న పిల్లల హృదయాలలోకి ప్రవేశించగా, వారు హరినామం! హరిబోల్! హరిబోల్! అని జపించడం ప్రారంభించారు. చైతన్యదేవుడు తాను ఆత్మహత్య చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అప్పుడు నా హృదయంలోకి ఎవరు వచ్చారో నాకు తెలియదు – నిత్యానంద ప్రభువునా లేక శ్రీల ప్రభుపాదులనా. కానీ నేను కచ్చితంగా వారి వద్దకు వెళ్ళాను. భక్తి చారు మహారాజుకు హాని కలిగించేలా ఏమి జరిగి ఉంటుందో లేదా బహుశా ఏదైనా భక్తుడు ఆయనతో దురుసుగా ప్రవర్తించి ఉంటాడో అని నేను చాలా భయపడ్డాను. అప్పుడు నేను ఆయన ఇంటికి మూడుసార్లు వెళ్ళాను. దీనికి ముందు నేను నా దైవ సోదరుడిని లేదా దైవ సోదరిని తిరిగి తీసుకురావడానికి వారి ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ నేను ఆయన ఇంటికి మూడుసార్లు వెళ్ళాను , అయినా ఆయన కనబడలేదు. ఆ తర్వాత అతను కలకత్తా ఆలయానికి వచ్చి చర్చించి, నాతో పాటు మాయాపూర్‌కు తిరిగి వెళ్ళాడు.

ఒక గ్రంథాన్ని అనువదించడానికి చాలా సమయం పడుతుందని మనకు తెలుసు. కానీ శ్రీల ప్రభుపాదుల ఆజ్ఞ మేరకు, ఆయన భగవద్గీత, శ్రీమద్భాగవతం మరియు చైతన్యచరితామృతాన్ని చాలా వేగంగా అనువదించారు. శ్రీల ప్రభుపాదులు అక్కడ ఉన్నప్పుడు, పరమ పూజ్య భక్తి చారు స్వామికి శ్రీల ప్రభుపాదుల పట్ల ఉన్న అపారమైన గురుభక్తిని మేము చూశాము. శ్రీల ప్రభుపాదులు ఆయనకు మొదటి హరినామ దీక్షను ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మహారాజుకు గాయత్రి మరియు సన్యాసం రెండింటినీ ప్రసాదించారు. శ్రీల ప్రభుపాదులు ఆయనను ఎంతగానో ప్రేమించేవారు. మరియు ఆయనకు శ్రీల ప్రభుపాదులు తప్ప మరేమీ తెలియదు. ఒకరోజు అర్ధ కుంభమేళాలో దానధర్మాలు, మంచి పనులు చేయడం గురించి విస్తృతంగా చర్చ జరుగుతుండగా, ఒక పాశ్చాత్య భక్తుడు శ్రీల ప్రభుపాదులను ఒక ప్రశ్న అడిగాడని ఆయన చెప్పారు. “ భక్తి యోగాన్ని పొందాలంటే చాలా పుణ్యకర్మలు చేయాలని మీరు అంటారు. నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను ఏ పుణ్యకర్మలూ చేయలేదని నాకు తెలుస్తోంది. నేను ఒక పతితుడిని. నాకు ఈ భక్తి యోగం ఎలా లభించింది ?” దానికి శ్రీల ప్రభుపాదులు, “నీ అదృష్టాన్ని నేనే కల్పించాను” అని అతనితో చెప్పారు.

పరమ పూజ్య భక్తి చారు స్వామి వారు, శ్రీల ప్రభుపాదులు తప్ప మనకు మరెవరూ లేరని గ్రహించారు. ఆయన ఎల్లప్పుడూ ఈ చైతన్యంలోనే ఉండేవారు మరియు భగవద్గీతను గానం చేశారు. ఆయన 'అభయచరణ్' అనే చిత్రాన్ని నిర్మించారు , అది దూరదర్శన్ ఛానల్‌లో ప్రసారం చేయబడింది. శ్రీల ప్రభుపాదులే మన మొదటి శిక్షాగురువు అని ఆయన అందరికీ చెప్పేవారు . ఈ విధంగా భక్తి చారు స్వామి ప్రజలందరితో ప్రవర్తించేవారు, అందుకే ఆయనను అందరూ ప్రేమించారు. కొన్ని రోజుల క్రితం లాక్‌డౌన్ కారణంగా నేను ఎక్కడికీ వెళ్లలేకపోతున్నానని నా కార్యదర్శులు అనుకున్నారు. నేను భక్తి చారు స్వామిని తలచుకుంటూ, మీ సమాధికి వెళ్లలేనని , నమస్కరించలేనని వ్యక్తపరుస్తున్నాను. మరియు నిన్న నాకు ఒక కల వచ్చింది. భక్తి చారు మహారాజు వచ్చి, “నా గురు సోదరుడు ఎక్కడ? జయపతాక స్వామి, ఆయన ఎక్కడ ఉన్నారు?” అని అడిగారు . అప్పుడు వారు, ఆయన పై అంతస్తులో ఉన్నారని చెప్పారు. ఆయన, “నేనే వెళ్లి ఆయన్ని చూస్తాను” అన్నారు. నా కార్యదర్శి, “నేను మీతో వస్తాను” అన్నారు. ఆ తర్వాత నాకు మెలకువ వచ్చింది. ఈ విధంగా భక్తి చారు మహారాజు, కలలో కూడా దర్శనం ఇచ్చారు.

పరమ పూజ్య భక్తి చారు స్వామి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటారు. ఆయన మనందరిలో శ్రీల ప్రభుపాద చైతన్యాన్ని విస్తరింపజేశారు. ఆయన సాంగత్యం మనకు లభించడం మన అదృష్టం .

హరే కృష్ణ! 

- END OF TRANSCRIPTION -
Transcribed by Jayarāseśvarī devī dāsī
Verifyed by JPS Archives
Reviewed by JPS Archives

Lecture Suggetions