Text Size

20201011 భద్ర పూర్ణిమా సాక్షాత్కార రాత్రిపై జూమ్ ప్రసంగం

11 Oct 2020|Duration: 00:08:50||Declaraciones públicas |Transcription|Śrī Māyāpur, India

ఈ క్రిందిది భారతదేశంలోని శ్రీ ధామ మాయాపూర్‌లో, 2020 అక్టోబర్ 11వ తేదీన పరమ పూజ్య జయపతాకా స్వామి మహారాజ్ గారు భద్ర పూర్ణిమ సాక్షాత్కార రాత్రి సందర్భంగా ఇచ్చిన జూమ్ ప్రసంగం.

nama oṁ viṣṇu-pādāya kṛṣṇa-preṣṭhāya bhū-tale
śrīmate bhaktivedānta-svamin iti namine

నమస్ తే సరస్వతే దేవే గౌర-వాణి-ప్రచారిణే
నిర్విశేష-శూన్యవాది-పాశ్చత్య-దేశ-తారిణే

జయపతాకా స్వామి : ఈ కోవిడ్-19 మహామారి వచ్చినప్పటి నుండి, నేను ఒక రకమైన స్వీయ నిర్బంధంలో ఉన్నాను. కానీ జూమ్ ఉపయోగించి, ఈ భద్ర పూర్ణిమలో పాల్గొనమని వివిధ భక్తులను ప్రేరేపించడానికి ప్రయత్నించాను. శ్రీమద్-భాగవతాన్ని పూజించడానికి ఇది ఒక ప్రత్యేకమైన అవకాశం అని మనకు తెలుసు . అలాగే, శ్రీమద్-భాగవతాన్ని ఎవరికైనా అందించడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి, నా రోజువారీ తరగతులలో, భద్ర పూర్ణిమ పండుగ ప్రాముఖ్యతను తెలియజేయడానికి కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నించాను. మరియు నేను ఒక పుస్తకాల బల్ల, ఒక వర్చువల్ పుస్తకాల బల్లను కూడా ఏర్పాటు చేసేవాడిని. ప్రజలు పుస్తకాలను లేదా భాగవతం సెట్లను ఆర్డర్ చేసేవారు , లేదా భాగవతం సెట్లను విరాళంగా ఇచ్చేవారు. కాబట్టి భద్ర పూర్ణిమ రోజున, నేను వివిధ గౌడీయ మఠాలకు భాగవతం సెట్లను అందజేశాను. వారు శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలను చదివితే, మనం ఆయనను ఎందుకంతగా గౌరవిస్తామో వారికి అర్థమవుతుందని నేను అనుకున్నాను. అయినప్పటికీ, గ్రంథాలయాలకు, కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు మరియు గ్రంథాలయాలు ఉన్న వివిధ సంస్థలకు నేను పుస్తకాలను పంపిణీ చేయించాను. తద్వారా ప్రజలకు శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు అందుబాటులోకి రాగలిగాయి. అలా, ఇక్కడే ఒకే చోట కూర్చుని, నా వర్చువల్ టేబుల్ నుండి నేను శ్రీమద్-భాగవతం యొక్క 495 సెట్లను పంపిణీ చేయగలిగాను . ప్రతి గురువు, ప్రతి సన్యాసికి ఒక వర్చువల్ టేబుల్ ఉండి, వారు శ్రీమద్-భాగవతాన్ని ప్రోత్సహిస్తే , వారు కూడా ఎన్నో పుస్తకాలను పంపిణీ చేయగలరని నేను భావిస్తున్నాను . కాబట్టి ఈ విధంగా, మనం భాగవతంపై చైతన్యాన్ని పెంచడానికి ప్రయత్నించి , భద్ర పూర్ణిమను గొప్ప విజయంగా మార్చవచ్చు. వారి స్ఫూర్తికి నేను బి.బి.టి.కి, విజయదాస్‌కి, మరియు పరమపాస వైశేషికదాస్‌కి ఎంతో కృతజ్ఞుడను. మేము భద్ర పూర్ణిమ నాడు మా ప్రత్యేక పూజ చేయడానికి ప్రయత్నించాము. నిజానికి, శంకరదేవుడు ప్రబోధించిన అస్సాంలో, వారు శ్రీమద్-భాగవతాన్ని ఒక ప్రత్యేక పీఠంపై ఉంచి పూజించేవారు . కాబట్టి వారు బ్రాహ్మణులు కానందున , దేవతలను పూజించటానికి తాము అర్హులమని వారు భావించలేదు. కానీ శ్రీమద్ -భాగవతాన్ని ప్రతిఒక్కరూ పూజించవచ్చు . హరిబోల్!

శ్రీ చైతన్య ప్రభువు మనం శ్రీ కృష్ణ భగవానుని బోధనలను అధ్యయనం చేయాలని ప్రత్యేకంగా ఉపదేశించారు— గీత కృష్ణునిచే చెప్పబడింది మరియు భాగవతం కృష్ణుని గురించి చెప్పబడింది. అందువల్ల, భాగవతం ప్రతిని తీసుకున్న ప్రతి ఒక్కరికీ , మేము ఉచితంగా భగవద్గీతను ఇచ్చాము. ఆ విధంగా వారికి కృష్ణుని శిక్ష అంతా లభించింది.

చాలా ధన్యవాదాలు! ఈ భద్ర పూర్ణిమా వ్రతంలో పాల్గొన్న భక్తులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను . జుహులోని భక్తుల నుండి, అలాగే నా జోన్‌లోని భక్తులు కూడా ఈ యాప్ ఆలోచనలను మరియు ఇతర అన్ని విషయాలను సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. హరే కృష్ణ! చాలా ధన్యవాదాలు! 

- END OF TRANSCRIPTION -
Transcribed by Jayarāseśvarī devī dāsī
Verifyed by JPS Archives
Reviewed by JPS Archives

Lecture Suggetions