Text Size

20240926 నామహట్ట క్లాస్ (మాల్డా & దంకుని)

26 Sep 2024|Duration: 00:30:34||Programa de Nāmahaṭṭa |Śrī Māyāpur, India

మూకం కరోతి వాచలం పంగుం లంగయతే గిరిం
యత్-కృపా తమ్ అహం వందే శ్రీ-గురున్ దిన తరిణం
పరమానంద-మాధవం శ్రీ సత్య
చైతన్య తాన్యం

జయపతాకా స్వామి: శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం స్వీకరించిన తరువాత మాల్దాకు వెళ్లారు. అక్కడ ఆయన అనేక లీలలు ప్రదర్శించారు . అక్కడ శ్రీల రూప, సనాతన గోస్వామి ఉన్నారు, వారి సోదరుడు అనుపమ కూడా అక్కడే ఉన్నారు. నవాబ్ హుస్సేన్ షా, శ్రీ చైతన్య మహాప్రభు ఎవరో తెలుసుకోవాలనుకున్నారు. ఆయన మంత్రివర్గంలో ఒక హిందూ మంత్రి ఉండేవారు, అతను భయపడి, ఆయన ఒక ఫకీరు, ఒక బిచ్చగాడు అని నవాబుతో చెప్పాడు. నవాబు, “నేను నమ్మను” అన్నారు. అందుకు వారు, “మీరు రాజు, మీరేమనుకుంటున్నారు?” అన్నారు. ఆ నవాబు ఇలా అన్నారు, “ఆయనకు అల్లాతో ఏదో సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను. ప్రజలు నా కోసం ఎందుకు పని చేస్తారు? నా మంత్రులు, నా సైన్యం, వారందరూ పని చేస్తారు, నేను వారికి జీతాలు ఇస్తాను. నేను డబ్బు ఇవ్వకపోతే, వారు పని చేయరు. నేను రాణులకు కూడా బహుమతులు, డబ్బు ఇవ్వకపోతే వారు నాకు సేవ చేయరని నేను అనుకుంటున్నాను. కానీ శ్రీ చైతన్య మహాప్రభువును ఎంతో మంది అనుసరిస్తున్నారు! అయినా ఆయన వారికి ఏ డబ్బు ఇవ్వరు! ఇప్పుడు, అల్లా తప్ప మరెవరి కోసం ప్రజలు ఎలాంటి ప్రతిఫలం లేకుండా పని చేస్తారు? ఆయనకు అల్లాతో ఏదో సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను.” ఇప్పుడు హిందూ మంత్రివర్గం ఏమీ అనలేకపోయింది.

శ్రీ చైతన్య మహాప్రభువు మాల్దా నుండి రామకేలికి వెళ్లారు. అక్కడ ఆయన అనేక లీలలు ప్రదర్శించారు . ప్రతిఒక్కరూ భగవత్ ప్రేమను పొందాలన్నది శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క ఆకాంక్ష. కానీ ఈ భగవత్ ప్రేమను పొందడం చాలా అరుదైన విషయం. బ్రహ్మ-వైవర్త పురాణంలో చెప్పబడిన ప్రకారం, కలియుగంలో పదివేల సంవత్సరాల కాలం ఒక స్వర్ణయుగంగా ఉంటుందని శ్రీకృష్ణుడు ప్రవచించాడు. మరియు ఈ కాలంలో, భూమండలం అంతా కృష్ణ చైతన్యంతో నిండిపోతుంది! ఇప్పుడు, ఇది కలియుగం ఆరంభమైన ఐదు వేల సంవత్సరాలకు జరుగుతుంది. పరమపాత్ర ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద పశ్చిమ దేశాలకు వెళ్లారు మరియు ఆయనే ఆ స్వర్ణయుగాన్ని ప్రారంభించారని మేము భావిస్తున్నాము. కలియుగం ప్రారంభమైన 4,500 సంవత్సరాల తరువాత, శ్రీ చైతన్య మహాప్రభువు అవతరించారు. ఇప్పుడు 5000 సంవత్సరాలు గడిచాయి. అందువల్ల శ్రీల ప్రభుపాద శ్రీ గౌరాంగ మహాప్రభువు యొక్క కరుణను ప్రపంచమంతటా పంచిపెట్టారు. మీరందరూ శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క గౌర-మండల భూమి యొక్క ఉత్తరపు అంచున ఉన్నారు.

శ్రీ గౌడ-మండల-భూమి,      యేబా జానే చింతామణి,
తార హయ వ్రజభూమే వాసా

అయితే మీరందరూ వ్రజవాసులు ! స్త్రీలు ఉలు-ధ్వని చేసినప్పుడు , పురుషులు హరి-ధ్వని చేయాలి !

నేను ఇక్కడికి రాగలిగినందుకు చాలా కృతజ్ఞుడను. మీరందరూ శ్రీ చైతన్య మహాప్రభువు వారి బోధనలను ప్రచారం చేయాలని మేము కోరుకుంటున్నాము. గౌరాంగ మహాప్రభువు విశేష కరుణను ప్రసాదించారు. నవద్వీప-ధామంలో శ్రీమతి రాధారాణి వేణువు వాయిస్తూ ఉండేవారు. అంత అందంగా వేణువు ఎవరు వాయిస్తున్నారో చూడటానికి కృష్ణుడు వచ్చాడు! అప్పుడు, శ్రీమతి రాధారాణి వేణువు వాయించడం ఆయన చూశారు. ఆమె తన కోసం నవద్వీప-ధామాన్ని, అంటే ఆ తొమ్మిది ద్వీపాలను సృష్టించినందుకు ఆయన ఆమెకు చాలా కృతజ్ఞుడయ్యాడు. ఈ నవద్వీప-ధామం బృందావనానికి భిన్నంగా ఉండదని ఆయన అన్నారు. మరియు ఇక్కడ, బృందావనంలో ఉన్నట్లే అన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఇక్కడ, ముఖ్యంగా నిత్యానంద ప్రభువు పదే పదే పరిక్రమ చేశారు. తొమ్మిది రోజుల పరిక్రమ , ఒక రోజు పరిక్రమ , మూడు రోజుల పరిక్రమ . నితాయ్ ప్రభువు అనేకసార్లు నవద్వీప పరిక్రమ చేశారు. మీరందరూ కరుణ పొందడానికే నవద్వీప-ధామానికి వచ్చారు! నితాయ్ గౌరా, ఈ కరుణను పంచిపెట్టు! ఇక్కడ శ్రీకృష్ణుడు తన భక్తులు తనకు సేవ చేయడంలో ఎలా ఆనందిస్తారో అర్థం చేసుకోవాలని, అనుభూతి చెందాలని కోరుకున్నారు, అందుకే ఆయన శ్రీమతి రాధారాణితో ఏకమై గౌరాంగ మహాప్రభువుగా అవతరించారు! ఇక్కడ నవద్వీప-ధామంలో ఆయన 24 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత ఆయన కట్వాకు వెళ్లి, సన్యాసం స్వీకరించి, ఆపై నీలాచలకు వెళ్లారు. ఆ తర్వాత 5-6 సంవత్సరాల పాటు ఆయన భారతదేశమంతటా పర్యటించారు. ఆయన బృందావనం, బెనారస్, కాశీలకు వెళ్లి అక్కడ మాయావాదీ సన్యాసులను వైష్ణవులుగా మార్చారు! ఆ తర్వాత ఆయన నీలాచలకు తిరిగి వెళ్లారు. ఆయన గృహస్థుడిగా ఉన్నప్పుడు గయకు వెళ్లి అక్కడ దీక్ష తీసుకున్నారు. ఆయన తన తండ్రి జగన్నాథ మిశ్రునికి పిండదానం చేయడానికి గయకు వెళ్లారు, అక్కడ ఆయన ఈశ్వర పురిని కలుసుకుని ఆయన నుండి దీక్ష తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన నవద్వీపానికి తిరిగి వెళ్లి, అక్కడి నుండి కానై-నాటశాలకు వెళ్లారు. అప్పుడు ఆయన ప్రత్యేకంగా కృష్ణ నామాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. మీలో ఎవరైనా కృష్ణుని నామాన్ని జపిస్తారా?

కృష్ణుని నామజపం చేయడం కలియుగ ధర్మం . ప్రతిఒక్కరూ ప్రతిరోజూ కృష్ణుని నామజపం చేయాలి. మరియు శ్రీమద్భాగవతం , భగవద్గీతను తప్పక పఠించాలి . మన పరమ పూజ్య భక్తి విజయ భాగవత స్వామి వారు ఇక్కడ ఉన్నారు, మరియు ఆయన పుస్తక పంపిణీ ప్రాముఖ్యత గురించి మాట్లాడతారు. మాల్దా మరియు దక్షిణ దినాజ్‌పూర్‌లో పుస్తక పంపిణీకి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కొన్ని రోజుల క్రితం, భాద్రపూర్ణిమ సందర్భంగా, శ్రీమద్భాగవతం పుస్తకాలు విరాళంగా ఇవ్వబడ్డాయి. ఇప్పుడు భగవద్గీత పంపిణీకి ఒక సుదీర్ఘ యాత్ర ప్రారంభమైంది. పరీక్షిత్ మహారాజు ఏడు పగళ్ళు, ఏడు రాత్రులు శ్రీమద్భాగవతాన్ని విన్నారు. శ్రీల ప్రభుపాద వారు భగవద్గీత , ఈశోపనిషత్ , భక్తిరసామృతసింధు వంటి వివిధ డిగ్రీలను స్థాపించారు. ఈ గ్రంథాలను అధ్యయనం చేసి భక్తిశాస్త్రి డిగ్రీని పొందవచ్చు. అలాగే, శ్రీమద్భాగవతంలోని మొదటి ఆరు స్కంధాలను అధ్యయనం చేసి భక్తివైభవ డిగ్రీని పొందవచ్చు. శ్రీమద్భాగవతంలోని చివరి ఆరు స్కంధాలను అధ్యయనం చేసి భక్తివేదాంత డిగ్రీని పొందవచ్చు. నా దగ్గర భక్తివేదాంత డిగ్రీ ఉంది! భక్తిసార్వభౌమ అంటే చైతన్యచరితామృతం యొక్క అధ్యయనం . నేను ఇప్పుడు దానికోసమే చదువుకుంటున్నాను. నేను దానిని ఎన్నోసార్లు అధ్యయనం చేశాను, కానీ ఇప్పుడు పరీక్ష రాస్తున్నాను. మీరందరూ శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలను చదవాలని నేను కోరుకుంటున్నాను. సరిగ్గా చదవలేని వారి కోసం, ఇప్పుడు ఇంటర్నెట్‌లో 'ట్రాన్సెండ్' అనే యాప్ ఉంది. అందులో శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలన్నీ ఉన్నాయి, వాటిని చదవడంతో పాటు వినవచ్చు కూడా. ఈ పుస్తకాలను చదవడం, అధ్యయనం చేయడం చాలా విశిష్టమైనది. నాకు శ్రీల ప్రభుపాదుల వారి సాంగత్యం లభించడం నా అదృష్టం. మీరందరూ శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలను చదవడం ద్వారా ఆయన సాంగత్యాన్ని పొందగలరు!

ఇప్పుడు నేను మందులు వేసుకోవాలి.

హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే/
హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే

- END OF TRANSCRIPTION -
Transcribed by Jayarāseśvarī devī dāsī
Verifyed by
Reviewed by

Lecture Suggetions