Text Size

20201012 ప్రశ్నోత్తరాల కార్యక్రమం

12 Oct 2020|Duration: 00:09:59||Sesión de preguntas y respuestas|Transcription|Śrī Māyāpur, India

ఈ క్రిందిది భారతదేశంలోని శ్రీధామ మాయాపూర్‌లో 2020 అక్టోబర్ 12వ తేదీన పరమ పూజ్య జయపతాక స్వామి మహారాజ్ గారు నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం.

ప్రశ్న: హరే కృష్ణ గురు మహారాజ.  మరణ సమయంలో నలభై వేల తేళ్ల కాటుకు గురైనంత బాధను అనుభవిస్తారని అంటారు.  భక్తులు కూడా అదే బాధను అనుభవిస్తారా?

మీ కుమార్తె,
స్వర్ణ గోపికా దేవి దాసి,
దామోదరదేశ.

జయపతాక స్వామి: ఒక రోజు నేను దంతవైద్యుని వద్దకు వెళ్ళాను. మరణించడం, ప్రసవ వేదన,  మూత్రపిండంలో రాళ్లు  మరియు దంతవైద్యుని కార్యాలయం - ఇవే అత్యంత తీవ్రమైన నొప్పులని ఆ దంతవైద్యుడు చెప్పారు.  కాబట్టి, మీ దంతవైద్యుని కార్యాలయానికి మీకు స్వాగతం.  కానీ భక్తులు ఈ లోకాన్ని చాలా సంతోషంగా విడిచిపెట్టగలరట,  ఎందుకంటే వారు భగవద్ధామానికి తిరిగి తమ స్వగృహానికి వెళ్తున్నారట.  పరమ పూజ్య భక్తి చారు స్వామి వారు  ముఖంపై చిరునవ్వుతో పరమపదించారని మేము విన్నాము.  హరిబోల్!

ప్రశ్న: 25 సంవత్సరాలకు పైగా కృష్ణ చైతన్యాన్ని అభ్యసిస్తున్నప్పటికీ , దీక్ష పొందిన కొందరు భక్తులు ఇప్పటికీ కొందరిపై ఎందుకు ద్వేషాన్ని కలిగి ఉన్నారు  ? ఆ శ్రవణం , కీర్తనం అన్నీ ఎక్కడికి పోయాయి?  ఈ ఇచ్ఛా ద్వేషం నుండి ఎలా బయటపడాలి ?  మన సాధనలో మనం ఏదైనా కోల్పోతున్నామా

మీ వినయపూర్వక శిష్యుడు,
కేశవ గౌర దాస,
బెంగళూరు.

జయపతాకా స్వామి: నేను ఇతరులలోని మంచి గుణాలను మాత్రమే చూస్తాను.  వారికి ఇతరుల పట్ల ద్వేషం ఉందో లేదో నేను చూడను,  ఒకవేళ ఉన్నా  కూడా మనం దానిని మరచిపోవాలి.  ఏదేమైనా, ఎవరైనా అపరాధాలతో  శ్రవణం మరియు కీర్తనం చేస్తున్నా , దాని ఫలితం చాలా పరిమితంగా ఉంటుంది.  కాబట్టి, మనం అపరాధరహిత జపాన్ని చేయడానికి ప్రయత్నించాలి.  అందుకే దీక్ష తీసుకునే సమయంలో మనం పది అపరాధాల గురించి చర్చిస్తాము.  కానీ కాలానుగుణంగా, ఈ అపరాధాలను నివారించాలని మనకు మనం గుర్తు చేసుకోవాలి.

ప్రశ్న: నాకు ఒక వినయపూర్వకమైన వివరణ ఉంది. రేపటి నుండి ఈ పురుషోత్తమ మాసంలో పంచరాతి వ్రతాన్ని పాటించమని సిఫార్సు చేయబడింది. దయచేసి దీని గురించి వివరించగలరా? దీనిని ఎలా పాటించాలి?

మీ అబ్బాయి,
సిదానంద నిమాయి దాస,
బెంగళూరు.

జయపతాకా స్వామి: భీష్మ-పంచకంలో మూడు ఉపవాసాలు పాటించమని సిఫార్సు చేయబడిందని మనకు తెలుసు.  అందులో మొదటిది పంచ-గవ్యలేదా రెండవది పండ్లు, దుంపలు, లేదా  మూడవది హవిశ్యన్నఇందులో పండ్లు, దుంపలు  , కొన్ని పాల ఉత్పత్తులు, కొన్ని ధాన్యాలు ఉంటాయి.  కానీ రేపు పరమ ఏకాదశి అని నేను చదువుతున్నాను.  సాయంత్రం నుండి మనం పారవశ్యంతో  హరే కృష్ణ మహా-మంత్రాన్ని జపిస్తూ, నృత్యం చేయాలి, వీలైతే రాత్రంతా మేల్కొని జపించాలి.  కానీ కనీసం మనమందరం సాయంత్రమైనా జపించవచ్చు.  ఇక ఏకాదశి తర్వాత చేసే ఐదు రోజుల ఉపవాసం విషయానికొస్తే,  మీ శక్తి మేరకు ఉపవాసం చేయమని ఉంది.  బహుశా ఆ ఐదు రోజులలో మీరు ఏదైనా వదులుకోవచ్చు.  మీ సేవకు పూర్తిగా ఆటంకం కలిగించే పనిని మాత్రం చేయవద్దు.  పురుషోత్తమ మాస ఉపవాసాన్ని ఎలా విరమించాలి అని నన్ను అడిగారు.  14వ రోజున ఉపవాసం విరమించాలని శాస్త్రంలో చదివాను,  కాబట్టి  ఆ వివరాలను పోస్ట్ చేస్తాను. 

ప్రశ్న: గురు మహారాజా, నేను ఒక సందిగ్ధంలో ఉన్నాను!  మీరు చైతన్య-లీల మీద ఈ అమృతతుల్యమైన తరగతిని ఇస్తున్నారు , నేను దానిని రాసుకుని వింటున్నాను, దాన్ని అస్సలు వదులుకోలేను.  అదే సమయంలో, నవద్వీప-మండల -పరిక్రమ జరుగుతోంది,  నేను దానిని నా ఐ-ప్యాడ్‌లో ఉంచుకున్నప్పటికీ,  సమయాలు ఇంతగా సరిపోలకపోవడంతో దానిని అంతగా ఆస్వాదించలేకపోతున్నాను.  నాకు తెలియడం లేదు, ఇలా చేయడం వల్ల నేను ఏమైనా తప్పులు చేస్తున్నానా?

మీ ప్రాముఖ్యత లేని ఆధ్యాత్మిక కుమార్తె,
జయరాసేశ్వరి దేవి దాసి

జయపతాక స్వామి: నా తరగతి దాదాపుగా ప్రతి రోజూ  సాయంత్రం 7 గంటలకి ఉంటుంది.  ఈస్ట్ ఇండియా డివిజనల్ కౌన్సిల్ (EIDC) సమావేశం కారణంగా ఈరోజు నేను కొంచెం ఆలస్యమయ్యాను.  కానీ నవద్వీప వర్చువల్ పరిక్రమను కూడా  అదే సమయంలో  ఎందుకు నిర్వహిస్తున్నారో నాకు కచ్చితంగా తెలియదు  . అయితే, పరిక్రమలోని ప్రతి రోజు కోసం నేను ఒక సందేశాన్ని ముందుగానే రికార్డ్ చేశాను .  కాబట్టి మీకు నచ్చిన దానికి మీరు హాజరు కావచ్చు.  ఈ తరగతి కూడా రికార్డ్ చేయబడింది. మీరు దీన్ని తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

- END OF TRANSCRIPTION -
Transcribed by Jayarāseśvarī devī dāsī
Verifyed by JPS Archives
Reviewed by JPS Archives

Lecture Suggetions